‘టిటిడి తిరుమల స్పెసిఫైడ్ అథారిటి పెద్ద కుట్ర’

 

• టిటిడి పాలకమండలిని కాదని, ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ నియమించడం వెనుకపెద్దకుట్రేఉంది.
• స్వామివారికి భక్తులుసమర్పించే కానుకలు, ఆస్తులు, ఫిక్స్ డ్ డిపాజిట్ల స్వాహాకు కుట్రచేస్తున్నారు.
• పాలకులదోపిడీకి పాలకమండలి సహకరించడంలేదనే స్పెసిఫైడ్ అథారిటీని నియమించారు.
• స్వామివారి ప్రసాదవిక్రయకేంద్రాల్లో ప్రైవేట్ వ్యక్తులను నియమిస్తే, వారుచేతివాటంచూపే అవకాశముంది.
• బ్యాంకులసిబ్బంది గతంలో ప్రసాదవిక్రయకేంద్రాల్లో ఉచితంగా సేవలందించేవారు.
• హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పాలకులు వ్యవహరిస్తున్నారు.
• ప్రభుత్వం తక్షణమే స్పెసిఫైడ్ అథారిటీని రద్దుచేసి, పాలకమండలిని పునర్నియమించాలి.

 

పుట్ట సుధాకర్ యాదవ్
పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ టిటిడి చెయిర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ వేయడంలోని మర్మమేంటని, పాలకమండలిని కాదని, అథారిటీ నియమించడం వెనుక పెద్ద కుట్రేదో ఉందనే అనుమానం తమకు కలుగుతోందని టీడీపీనేత, టీటీడీ మాజీఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు.

శుక్రవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ విక్రయ కౌంటర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు.

‘పవిత్రంగా, నిష్టతో తయారుచేసే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అనేక బ్యాంకుల సిబ్బంది నిత్యం స్వామివారి సేవలో తరిస్తూ, విక్రయకేంద్రాల్లో ఉండి, భక్తులకు ఉచితంగా అందించేవారు. అలాంటి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని బయటి వ్యక్తులకు అప్పగిస్తే, స్వామివారి ప్రసాదాన్ని ఇష్టానుసారం వారికి నచ్చిన ధరలకు అమ్ముకునే అవకాశముంది,’ అని సుధాకర్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

శ్రీవారి ప్రసాదానికి ఎంతో విశిష్టత, పవిత్రత ఉన్నాయని వాటిని మంట గలిపేలా స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రసాద విక్రయాల పేరుతో పెద్దస్కామ్ కు పాల్పడే అవకాశం కూడా ఉందన్నారు. దానితోపాటు స్వామివారిఆస్తులు, స్వామివారి పేరుతో బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల తాలూకా సొమ్ము కాజేయడానికే స్పెసిఫైడ్ అథారిటినీ నియమించడం జరిగిందని అన్నారు.

గతంలో పాలకమండలిలోని అధికారులు దోపిడీకి అనుకూలంగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వానికి సరిగా సహకరించడం లేదనే వారిని తప్పించి, అథారిటీని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు, ఆస్తులు, ఇతరత్రా విలువైన వస్తువుల స్వాహాకు కుట్ర జరుగుతోందన్నారు.

అదేగానీ జరిగితే తిరుమలక్షేత్ర విశిష్టత మంటగలిసే అవకాశముందని సుధాకర్ చెప్పారు. హిందువుల, శ్రీవారి భక్తుల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని రద్దుచేసి, పాలకమండలిని పునర్నియమించాలని టీడీపీనేత డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *