‘కోర్టు మొట్టికాయలు వేస్తేనే ముఖ్యమంత్రికి క్లారిటీ వస్తుందా?’

(కింజారపు అచ్చెన్నాయుడు)

విద్యార్ధులు, యువత తలుచుకుంటే దేనినైనా సాధిస్తారని మరో సారి నిరూపణ అయ్యింది.

మొండి పట్టుదలతో పరీక్షల నిర్వహణకు పోవాలనుకున్న జగన్ రెడ్డికి    సుప్రీం కోర్టు ముట్టికాయలు వేస్తే గాని దిగిరాక తప్పలేదు.

కన్ఫ్యూ జన్ ముఖ్యమంత్రికి, మంత్రికి ఇప్పటికి క్లారిటీ వచ్చిందా?

పరీక్షల రద్దు విద్యార్ధులు, తల్లిదండ్రుల విజయం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే జగన్ రెడ్డి మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లనట్లుగా పరీక్షలు నిర్వహించాలనుకున్నారు.

నారా లోకేష్ పరీక్షల రద్దు కోసం రెండు నెలల నుంచి విద్యార్ధుల అలుపెరగని పోరాటం చేశారు. ఆఖరికి న్యాయ పోరాటాకైనా వెనుకాడలేదు. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యం అందుకే పరీక్షలు రద్దు చెయ్యమని డిమాండ్ చేశారు. విద్యార్దులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి అందరిని ఏకతాటిపైకి తేవడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పటికే ఎంత మంది చెప్పినా మొండి వైఖరితో పరీక్షల విషయంలో విద్యార్ధులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు.

దేశ ప్రధాని సైతం విద్యార్ధులు, తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరీక్షలు రద్దు చేస్తే జగన్ రెడ్డికి వారితో చర్చించే సమయం లేదా?

(కింజారపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *