5 వేలు కిందికి దిగిన ఆంధ్ర కరోనా కేసులు

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  కోవిడ్ కేసులు 5 వేల కిందకు దిగాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88,622 పరీక్షలు నిర్వహించగా కేవలం 4,981 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,67,017 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 38 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,490కి చేరింది. 24 గంటల వ్యవధిలో 6,464 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,04,844కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో49,683 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,14,49,636 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *