జర్నలిస్టు రఘు అరెస్టుపై తెలంగాణ పోలీసులకు నోటీసు

టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్ పై హెచ్.ఆర్.సి స్పందన.

సీనియర్ జర్నిస్టు రఘు కిడ్నాప్ తరహాలో అరెస్టు  చేయడంపై రిపోర్ట్ ఇవ్వాలని రాచకొండ సీపీకి తెలంగాణ హ్యమన్ రైట్స్ కమిషన్ నోటీసు జారీ చేసింది.

జర్నలిస్టు గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మానవ హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈ నెల 9న, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య లు చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది.

జర్నలిస్టు రఘును ఎందుకు అరెస్టు చేశారు. పోలీసులు మఫ్టీలో అతన్ని ఆ విధంగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది తదితర వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలంటూ రాచకొండ పోలీసు కమిషనర్ కు హెచ్చార్సి శుక్రవారం నోటీసు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *