భీకరంగా తీరం తాకిన యాస్ తుఫాన్

యాస్‌ తుపాను ఎట్టకేలకు ఉదయం 10.30కి ఒదిశా  తీరం దాటింది. తఫానును దృష్టిలో పెట్టకుని ఒదిశా, పశ్చిమబెంగాల్  రాష్ట్ర ప్రభుత్వాలు  14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇదేవిధంగా పొరుగున ఉన్న జార్ఖండ్ లోని సింఘ్బూమ్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణ నష్టం, పెద్దగా ఆస్తి నష్టం లేకుండా నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

ఒదిశాలోని దామ్రా- దక్షిణ బాలసోర్‌ మధ్య  తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 155కి.మీ వేగంతో గాలులు వీచాయి.యాస్ వేగంగా దూసుకుపోయే తుఫాన్ కాదు. అందువల్ల తీరం తాకడం మూడు నాలుగుగంటలు కొనసాగుతుందని అధాకారులు చెబుతున్నారు.  ఇప్పటికే తుపాను ప్రభావానికి ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. ఒదిషాలోని కేంద్రపాద,  జగత్సింగ్ పూర్, జైపూర్, భద్రక్, కటక్ ధెంకనాల్ మీద భీభత్సం సృష్టిస్తున్నది. ఒదిశా  నుంచి ఇది ఝార్ఖండ్ వైపు కదులుతుంది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *