త్వరలో 7 తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.

 

త్వరలో తెలంగాణలో ఏడు ఎమ్మెల్సీ పోస్టుల ఖాళీ అవుతున్నాయి. ఇందులో  ఎమ్మెల్యే కోటా కు చెందిన 6 గురు ఎమ్మెల్సీల గడువు జూన్ 3 వ తేదీతో ముగుస్తున్నది.

గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీలు

1. గుత్తా సుఖేందర్ రెడ్డి
2. నేతి విద్యాసాగర్
3. కడియం శ్రీహరి
4. ఫరీదుద్దీన్
5. ఆకుల లలిత
6. బోడకుంటి వెంకరేశ్వర్లు.

ఇందులో గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ ఫిరాయించిన సభ్యుడు కె యాదవరెడ్డి స్ఘానంలో ఎంపిక య్యారు. యాదవ రెడ్డి టిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో మారడంతో పిరాయింపు నిరోధ చట్టం కిందను అనర్హుడయ్యారు. దీనితో 2019లోనే ఆయన సీటు ఖాళీ అయింది.ఉప ఎన్నిక జరిగింది. అందుకే ఆయన మిగిలిన కాలానికి మాత్రం ఎంపికయ్యారు. తర్వాత ఆయన చెయిర్మన్ అయ్యారు.

ఈ 6 స్థానాలకు  కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏ డో  స్థానం గవర్నర్ కోటా నుంచి ఖాళీ అవుతుంది. ఇది జూన్ 16 వ తేదీతో ప్రొ. శ్రీనివాస్ రెడ్డి గడువు ముగుస్తుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *