ఆంధ్రలో ఈ రోజు కోవిడ్ కేసులు తగ్గాయి, పరీక్షలూ తగ్గాయి!

ఆంధప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు చాలా రోజుల తర్వాత తగ్గినట్లు కనిపించాయి. గత 24 గంటలలో  60,124  కోవిడ్ పరీక్షలు జరిపితే, 14,986 కొత్త పాజిటివ్ కేసులు కనిపించాయి. ఇక మరణాలకు సంబంధించి   పశ్చిమగోదావరి జిల్లాలో 12 మంది, తూర్పుగోదావరిలో 10 మంది, విశాఖలో 9 మంది, నెల్లూరులో 8 మంది, విజయనగరంలో ఎనిమిది మంది, చిత్తూరు జిల్లాలో  ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, కృష్ణలో  నలుగురు, శ్రీకాకుళం నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు.

నిన్నటి తో పోలిస్తే కేసులు బాగా తగ్గాయి.  మే 9 తేదీన ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. అంతకు ముందటి 24 గంటలలో  22,164కేసులు నమోదయ్యాయి. 1,05,494 శాంపిల్స్ ని పరీక్షించగా 22,164 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారణ అయింది. నిన్నటికి ఈ రోజుకి 7,270 కేసులు తగ్గాయి. నిన్నటికంటే కోవిడ్ పరీక్షలు ఈ  రోజు 45370 పరీక్షలు తగ్గాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *