FLASH వైసిపి నేత డాక్టర్ జ్యోత్స్నలత కోవిడ్ తో మృతి

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన  ప్రముఖ డాక్టర్, రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ నేత డాక్టర్ రాధా జోత్స్నా లత  కరోనా తో చికిత్స పొందుతూ సోమవారం చెన్నై లోని ఓ ప్రేవేట్ హాస్పిటలో తుదిశ్వాస విడిచారు .

16 రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన డాక్టర్ రాధా జోత్స్నా లత చెన్నైలోని ఓ ప్రేవేట్ హాస్పటల్ చేరారు,అక్కడే చికిత్స పొందుతున్నారు.  ఆమె నాగరాజు కూడా చెన్నై లో ఉన్నారు.

సోమవారం ఉదయం ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయాయి. ఐసీయూ కు తరలిస్తున్న సమయంలో  ఆక్సిజన్ అందక  ఆమె మృతి చెందారు.

డాక్టర్ రాధా జోత్స్నా లత మృత దేహాన్ని చెన్నై నుండి నెల్లూరు కు సాయంత్రం 4 గంటలకు తీసుకొని వచ్చి నెల్లూరు లో పెన్నానది వద్ద నున్న స్వర్గధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రాధా జోత్స్నా లత భర్త నాగరాజు తెలిపారు.

ఎంతో మంది నిరుపేదలకు వైద్య సేవలు అందించి జిల్లాలో మంచి పేరు సంపాదించారు. గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ రాధా జోత్స్నా లత ఉన్నత విద్యను అభ్యసించి కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు.

డాక్టర్ రాధా జోత్స్నా లత 2014 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయేడాది  న్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున శాసన సభ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరువాత రెండు ఏళ్ళు టీడీపీ ప్రభుత్వంలో గూడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా వ్యవహరించారు. ఆ తరువాత గూడూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్ గా విశిష్ట సేవలందించారు. తరువాత డా. లత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  వైసీపీ లో రాష్ట్ర మహిళ నేత గా గుర్తింపు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *