ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి అమలులోకి వచ్చిన పాక్షిక కర్ఫ్యూ నుంచి అనేక సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈమేరకు ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 18 వరకు కొనసాగే కర్ప్యూ లో మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్న సంగతి తెలిసిందే.
కర్ఫ్యూ నుంచి మినహాయింపులు:
కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు….
టెలికామ్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపు…
పెట్రోలు బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్లెట్లకు మినహాయింపు….
విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలకు మినహాయింపు…
నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు…
విమాన, రైల్వే ప్రయాణికులకు మినహాయింపు. అయితే టికెట్లు చూపించాల్సి ఉంటుంది. .
పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు…
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు, రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశం…
వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు.
ఇప్పటికే నిర్ణయించిన వివాహాలు, ఇతర శుభకార్యాలకు మినహాయిపు అయితే అతిథులు 20 మందికి మించవద్దు. పెళ్లిళ్లు జరుపుకునేందుకు అనుమతి తప్పనిసరి….
…