ఈటల మీద విచారణకు కెసిఆర్ ఆదేశాలు, అరెస్టు కు రంగం సిద్ధం?

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే ఫిర్యాదు మీద ముఖ్యమంత్రి కెసిఆర్ విచారణకు ఆదేశించారు.

ఈ కుంభకోణాన్ని ఈ రోజు కెసిఆర్ కుటుంబ సభ్యుల న్యూస్ చానెల్  టి.న్యూస్ ‘సాక్ష్యా’లతో సహా పకడ్బందీగా ’బయట’పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారం మీద మెదక్  జిల్లా కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి సమగ్ర నివేదికను తెప్పించాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావు ని కూడా సిఎం అదేశించారు.

ఈ నివేదికలు అందగానే ఈటలను అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ ఉంది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/eatala-in-land-scam-likely-to-be-arrested/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *