కర్నూలు ఎయిర్ పోర్టులో రేపు దిగనున్న తొలి విమానం ఇదే…

ఓర్వకల్/కర్నూలు విమాశ్రాయనికి ఈ నెల 28 న ఉదయం 10:10 గంటలకు తొలి  ప్యాసింజర్ ఫ్లైట్ బెంగళూరు నుండి కర్నూలు కు(ఇండిగో 6E 7911) వస్తున్నది.

అలాగే కర్నూలు విమానాశ్రయం నుండి 10:30 గంటలకు తొలి ఫ్లైట్ విశాఖపట్నం కు (ఇండిగో 6E 7912) బయలుదేరి వెళుతోంది.

ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ , ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు, పోస్టల్ శాఖ అధికారులు పాల్గొంటారు.

ఓర్వకల్లు విమనాశ్రాయాన్ని ఈ నెల 25 న ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఆ కార్యక్రమానికి  సంబంధించిన స్మారక పోస్టల్ కవర్ ను కర్నూలు నుండి విశాఖపట్నం వెళ్లే తొలి ప్రయాణిస్తారు.

27-3-2021 మద్యాహ్నం వరకు కర్నూలు/ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ అధికారులు అందించిన సమాచారం మేరకు కర్నూలు విమానాశ్రయం  తొలి రోజు 28-3-2021 ఫ్లైట్స్ లో వస్తున్న/వెళుతున్న ప్యాసింజర్స్ సంఖ్య వివరాలు

BLR-KJB=52 ప్రయాణికులు
KJB-VTZ=66 మంది
VTZ-KJB=31 మంది
KJB-BLR=63 మంది
MAA-KJB=16 మంది
KJB-MAA=32 మంది

KJB – Kurnool Airport
BLR – Bangalore
VTZ -Vizag
MAA – Chennai/Madras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *