జమునగా తమన్నా? త్వరలో నాటి అందాల నటి బయోపిక్

అలనాటి అందాల నటి జమునగా తమన్నా కనిపించ బోతోందా? సావిత్రి బయోపిక్ ‘మహానటి’ లో కీర్తీ సురేష్ నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
‘మహానటి’ పెద్ద హిట్టయ్యింది. సావిత్రి తర్వాత జమున అంత పేరున్న హీరోయిన్ అప్పట్లో.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల వంటి హేమాహేమీలతో భక్తి, పౌరాణిక, సాంఘిక చలన చిత్రాలెన్నింటిలోనో నటించింది.
1954 – 83 మధ్య 200 సినిమాల్లో నటించింది. తెలుగు తమిళ కన్నడలతో బాటు, హిందీలోనూ నటించింది. కొంత కాలం రాజకీయాల్లోనూ వుంది. 1989 లో రాజమండ్రి నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయింది. జమున బయోపిక్ తీయాలంటే అది బృహత్ ప్రణాళిక అవుతుంది.
ఈ తరం ప్రేక్షకులకి పరిచయమవడానికి జమున బయోపిక్ కూడా రావాల్సిన అవసరమెంతైనా వుంది. ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఒక ప్రముఖ నిర్మాత. ఆయన జమునతో సంప్రదింపులు జరుపుతున్నారు.
జమునగా నటింపజేసేందుకు తమన్నాతో చర్చలు జరుగుతున్నాయి. గతవారం విడుదలైన ‘దేవినేని’ దర్శకుడు శివనాగు తమన్నాకి కథ విన్పించాడని తెలుస్తోంది. అటు జమున, ఇటు తమన్నా ఓకే అంటే ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సావిత్రి సరసన బయోపిక్ తో జమున వుంటుంది జ్ఞాపకంగా.
తమన్నా ఇప్పుడు కొన్ని సినిమాలతో నిజీగా వుంది. నితిన్ తో ‘అంధాధున్’ తెలుగు రీమేక్, సత్య దేవ్ తో ‘గుర్తుందా శీతాకాలం’  అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’, హిందీ ‘బోలే చుడియా’ మొదలైన సినిమాలతో ఆమె బిజీగా వుంది.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/entertainment/kodi-ramakrishan-adigo-alladigo-1984-movie-review/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *