జగన్ ‘డోర్ డెలివరి’ పిచ్చి తుగ్లక్ పథకం: తులసిరెడ్డి

అమరావతి: ఇంటివద్దకే రేషన్ బియ్యం అంటూ  అట్టహాసంగా ముఖ్యమంత్రి జగన్ అమలుచేస్తున్న పథకాన్ని ఒక పిచ్చి తుగ్లక్ పథకం అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి వర్ణించారు.

’ఇది డోర్ డెలివరీ పథకం కాదు, రోడ్డు డెలివరీ పథకం‘ అని ఆయన వ్యాఖ్యానించారు.

దీని వల్ల అదనపు భారం రూ.830 కోట్లు అని  అంటూ  దీనివల్ల ఎవరూ సంతోషంగా, సంతృప్తికరంగా లేరని ఆయన అన్నారు.

“డీలర్లు ఎప్పుడూ తమ డీలర్ షిప్‌లు రద్దు అవుతాయోనన్న అభద్రతాభావంతో జీవిస్తున్నారు. ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కు పోయామని మీ వాహనాలు వద్దు మీరిచ్చే డబ్బులు వద్దు మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని వాహనదారులు మొరపెట్టు కుంటున్నారు. కూలి పని బదులు రోడ్ల మీద  ‘డోర్ డెలివరీ’ కోసం పడిగాపులు పడే దుస్థితి వచ్చిందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు,’ అని అన్నారు.  ప్రభుత్వం పునరాలోచించి పాత రేషన్ పద్ధతినే పునరుద్ధరించాలని తులసిరెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *