అంతర్వేది కొత్త రథం ప్రారంభించిన సిఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కోసం కోటి రూపాయలతో నిర్మించిన  నూతన రథాన్ని   సీఎం  వైయస్‌.జగన్‌ప్రారంభించారు.  ఈ రోజు ఆయన ఈ కార్యక్రమం కోసం ఆయన అంతర్వేది వచ్చారు. స్వామివారిని  దర్శించు కున్నారు.శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం గత సెప్టెంబర్ 6న దగ్ధం అయింది.
ఆరోజు  అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.  షెడ్డులో భద్రంగా ఉన్న రథానికి మంటలు అంటుకున్నాయి. ఫలితంగా పూర్తిగా దగ్ధం అయింది. షెడ్డులో ఉన్న రథానికి మంటలు ఎలా అంటుకున్నాయనేది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదు. మరి  రథానికి మంటలు అంటుకోవడంమేమిటి. ఏ ప్రమాదవశాత్తు ఇది జరిగింది? లేదా ఎవరయినా  ఆకతాయిలు ఈ పనిచేశారా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.

అంతర్వేది క్షేత్రం కాకినాడకు 130కిమీ దూరాన, రాజమండ్రికి 100కి.మీ దూరాన ఉంటుంది. ఇక్కడ కొలవై ఉన్ దేవుడు లక్ష్మీనరసింహుడు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య మయిన పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి.
సుమారు 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ఇది చాలా పాపులర్. సుమారు లక్షమంది దాకా ఈ రథోత్సవానికి హాజరవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *