ఆలయ ధర్మకర్తకు ఆగ్రహం, పెట్రోల్ డబ్బాతో ఇలా…

జనగామ బతుకమ్మ కుంట దుర్గమ్మ దేవాలయం లో ధర్మకర్తకు ఆగ్రహం వచ్చింది. తగలబెట్టుకుంటానని బెదిరిస్తున్నాడు. అంతేకాదు, ఇదిగో పెట్రోలు అని సీసా చూపిస్తున్నాడు. ఆయనకు ఇంత కోపం ఎందుకొచ్చిందటంటే…

ప్రభుత్వం ఆలయ పాలక మండలిని నియమించింది. ఇది  ఆయనకు ఆగ్రహం తెప్పించింది.  గుడిని అభివృద్ధి చేసేందుకు తాను, తనతో పాటు కష్టపడ్డ వారికి తెలియకుండా ఆలయ కమిటీ వేశారని ఆయన ఆగ్రహించారు.  దీనికి నిరసనగా ఆలయ ధర్మకర్త కర్రే నరసింహులు పెట్రోల్ డబ్బా తో గర్భగుడిలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. దేవుడి ఎదురుగానే ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *