ఇదీ ఆంధ్ర ఆర్థిక పరిస్థితి! 10 రోజులు దాటినా పూర్తిగా అందని పెన్షన్లు

ఆంధ్రప్రదేశ్ లో  పెన్షనర్లకు పెన్షన్ సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. దీనితో లక్షలాది మంది పెన్షనర్లు ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు.

రాష్ట్రంలో ఉన్న నాలుగు లక్షల మంది పెన్షనర్లకు గతంలో ప్రతి నెల ఒకటవ తరీకునే పెన్షన్ వచ్చేది. ఏదైనా తీవ్ర ఇబ్బందులు ఉంటే 2 లేక 3 రోజులు మాత్రమే అలస్యమయ్యేది. కానీ నేటి పరిస్థితి వేరు. ప్రతి నెల పెన్షన్ ఏ రోజు వస్తుందో గ్యారంటీ లేదు.

ప్రత్యేకంగా ఈ నెల విషయం తీసుకుంటే  11 రోజులు దాటినా ఇప్పటిదాకా  చాలా మందికి పెన్షన్ అందలేదు. ఇంత పెద్ద కరోన ప్రమాద పరిస్థితుల్లో, అనేక ఖర్చుల నైపథ్యంలో పెన్షన్ కోసం లక్షలాది ఎదురుచూస్తున్నారు. ఆ వచ్చే ఆ చిన్నపాటి పెన్షన్ ఎపుడొస్తుందో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఈ విషయాలను  విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్, ఎపి జెఎసి  అమరావతి నేతలు  బొప్పరాజు,  వైవీ రావు మీడియాకు వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కారణం ఆర్థిక శాఖ వైఫల్యం అని వారు ఆరోపించారు.

కొంతమంది ఉద్యోగులు వారి కూతురు/కుమారుని వివాహానికి  దాచుకున్న డబ్బులు సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  వడ్డీలకు డబ్బులు తీసుకుని ఆ వడ్డీలు చెల్లించలేక పెన్షనర్లు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని వారు తెలిపారు.

పెన్షనర్లకు పెన్షన్ చెల్లించినాకే మాకు జీతాలు చెల్లించండి అని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి విజ్ఞప్తి తాము  అనేక సార్లు ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించినా ఉపయోగం లేేకుండా పోయిందని వారు వెల్లడించారు. ప్రతి పెన్షన్లు చెల్లించడంలో  ఇదే తంతు ఎదురువుతుందని, దీనితో కేవలం పెన్షన్ మీద ఆధారపడిన లక్షలాది మంది వృద్ధులు మానసిక అశాంతికి లోవనవుతున్నారని వారు తెలిపారు.

మరికొంతమంది సకాలంలో బిల్లులు చెల్లింపు కాకపోవడంతో  ఇటీవల  ఇంట్లో శుభకార్యాలు కూడా వాయిదా వేసుకున్నారని కూడా వారు వెల్లడించారు.

ఆల్ఫ్రెడ్, బొప్పరాజు,  వైవీ రావు వెల్లడించిన విశేషాలు:

● గతంలో AP JAC అమరావతి పక్షాన ప్రభుత్వ పెద్దల నుండి ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులకు చాలా స్పష్టంగా “ముందు పెన్షనర్లకు పెన్షన్ చెల్లించినాకే మాకు జీత భత్యాలు ఇవ్వండి కారణం మాకు ఉద్యోగం ఉందని బయట అప్పులు అయినా ఇస్తారు కానీ పెన్షనర్లకు ఇవ్వరని చెప్పించాము”. అది కేవలం నెలా, రెండు నెలలు పాటించారు. కొత్తగా ఇటీవల కొన్ని జిల్లాల్లో కొన్ని శాఖలలో  కొంతమంది పెన్షనర్లకు పెన్షన్ వస్తుంది. మెజారిటీ పెన్షనర్లకు 1వ తరీకున పెన్షన్ రావడం లేదు అనేది వాస్తవం. ఇది కేవలం ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల వైఫల్యం అని చెప్పక తప్పదు.

● ప్రభుత్వ ఉద్యోగులు పదవీ (రిటైర్మెంట్ బెనిఫిట్స్) విరమణ రోజునే వారికి రావాలిసినవన్నీ చెల్లించాలి. కాని,  వారికి అందవలసిన కుటుంబ అవసరాల నిమిత్తం వారు దాచుకున్న (జిపిఎఫ్ నుండి), ఉద్యోగుల, పోలీసుల సరెండర్ లీవ్స్ చెల్లింపులు తదితర బిల్లులన్నియు నెలల తరబడి ఆర్ధిక శాఖలో పేరుకుపోయి ఆర్ధిక శాఖ కార్యదర్శి  ఆమోదం కొరకు ఎదురు చూస్తున్నాయి. దీనితో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు గురి చెందుతున్నారు.

● ఈ విషయాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి కూడా AP JAC అమరావతి పక్షాన (representation) తీసుకుని వెళ్లగా, తప్పకుండా త్వరలో ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కాని సమస్య పరిష్కారం కావడం లేదు.

●  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  తక్షణమే ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పెన్షనర్లను ఆదుకోవాలి.  డిమాండ్లు:

1 . ఈ నెల పెన్షన్ ఇంకా ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలి.

2 . అదేవిధంగా ప్రతి నెలా ఉద్యోగుల జీతాలకన్నా ముందే పెన్షనర్లకు పెన్షన్ చెల్లించేవిధంగా ఆదేశాలు జరీచేయాలి

3 . ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన డబ్బులు తక్షణమే ఈ రోజు వరకు పెండింగులో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *