’విశాఖ ఉక్కు‘ ను కాపాడుకుంటాం: ఎంపి రామ్మోహన్ నాయుడు ప్రతిజ్ఞ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP)ను ప్రైవేటీకరించాలని  కేంద్ర కాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల శ్రీకాకుళం తెలుగు దేశం ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడు అభ్యంతరం చెప్పారు.

విశాఖ ఉక్కు ను అన్ని విధాలుగా బలహీనం పర్చి, నష్టాల్లో పడేలా చేసి, ఇపుడు ప్రయివేటీకరణ అంటున్నారని ఆయన విమర్శించారు.

ఈ నిర్ణయం అమలు అయితే,  ఆంధప్రదేశ్ నష్టపోతుందని చెబుతూ ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.

కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  కి శ్రీకాకుళం  రామ్ మోహన్ నాయుడు ఒక లేఖ రాశారు.

“విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు” నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసి  వేలాది విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయి, 32 మంది తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్న సంస్థ విశాఖ ఉక్కు.  VSPను నిర్మించడానికి 64 గ్రామాల ప్రజలు వారి ఇళ్లను ఖాళీ చేసి, 22,000 ఎకరాల భూమిని తాగ్యం చేశారు. కాబట్టి దీనిని ప్రవేయిటు సంస్థలకు అప్పగించడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించదు,’అని ఆయనలేఖలో పేర్కొన్నారు.

విశాఖ ఉక్కులో 17 వేల మంది పర్మనెంట్‌ ఉద్యోగులతో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, ప్రైవేటీకరణ వల్ల వీరి ఉద్యోగాలకు, వీరి కుటుంబాల భవిష్యత్తుకు తీరని నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కర్మాగార విస్తరణ పనులకు ఇటీవల చేసిన అప్పుల కారణంగా వడ్డీ భారం పెరగడం వంటి కారణాలు కూడా నష్టాలకు కారణమమని దేశవ్యాప్తంగా డిమాండ్‌ లేకపోవడం వలన ఆశించిన అమ్మకాలు జరగడం లేదని, దేశంలోని మిగితా స్టీల్ ప్లాంట్లది కూడా ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు.

‘అన్ని SAIL యూనిట్లలో ప్రభుత్వ పెట్టుబడి ఈక్విటీ రూపంలో వుంటే VSPలో మాత్రం పెద్ద మొత్తాన్ని లోన్ మరియు ప్రిఫరెన్షియల్ షేర్లుగా ఇచ్చారు, దీని కారణంగా RINL / VSP ఉత్పత్తి ప్రారంభించే సమయానికే నష్టాల్లో వుంది. SAIL మరియు TISCO ఆధ్వర్యంలో వున్న ఇతర ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులు కేటాయించబడ్డాయి కానీ VSP/RINLకు మాత్రం ఇప్పటివరకు క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులు లేవు. కేవలం ఇనుప ఖనిజం సేకరణపైనే సంవత్సరానికి దాదాపు రూ. 800-1000 కోట్లు ఖర్చవడం వలన VSP లాభాలు తగ్గాయని, మన రాష్ట్రంలో వున్న పరిశ్రమలకు ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమను చూపించారు,’ అని అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  విమర్శించారు.

2000ల సంవత్సరంలో అప్పటి శ్రీకాకుళం ఎంపి ఎర్రన్నాయుడు తన తండ్రి కూడా  VSP ప్రైవేటీకరణను పార్లమెంటులో గట్టిగా అడ్డుకున్నారని చెబుతూ అదే స్ఫూర్తితో ఇప్పుడు తాను కూడా ఉత్తరాంధ్ర ప్రజల హక్కైన స్టీల్ ప్లాంట్ కోసం వెనక్కి తగ్గకుండా పోరాడతానని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *