ఆమంచి కృష్ణ మోహన్ కు సిబిఐ పిలుపు

విశాఖ :-ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో కోర్ట్ లపైన అనుచిత వ్యాఖ్యలు చేశారనే  అభియోగం మీద సిబిఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ విచారణకు సంబంధించి ఈనెల 6న విశాఖ సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసులో  సీబీఐ పేర్కొంది.

ఆ మధ్య వైసిపి అభిమానులు, నేతలు కోర్టుల తెగ కామెంట్లు పెట్టారు. ఎక్కడో కూర్చుకుని సోషల్ మీడియా లో కామెంట్స్ పెడితే ఏమవుతుందిలే అనుకున్నట్లున్నారు. లక్ష్మణ రేఖదాటారు. హైకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. కేసునువిచారించాలని సిబిఐకి నివేదించింది.

ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసు గురించి మీకు తెలుసునని పిస్తూ ఉంది, అందువల్ల తన ఎదుట హాజరుకాలని సిబిఐ డిఎస్ పి వి శ్రీనివాస రావు ఈ నోటీసు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *