కృష్ణా జిల్లాకు చేరిన 42,500 డోసుల కోవిడ్ వ్యాక్సిన్

విజయవాడ, జనవరి 15:

ఈ నెల 16 న కృష్ణా జిల్లాలో మొదటి విడత కరోనా టీకా పంపిణీని 30 టీకా పంపిణీ కేంద్రాల ద్వారా (వ్యాక్సిన్ సెషన్ సైట్స్) కరోనా యోధులైన డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

జిల్లాకు 42,500 ల డోసుల కోవిడ్ వేక్సిన్ వచ్చింది. టీకా నిల్వ కేంద్రంలో అన్ని నిబంధనల మేరకు వ్యాక్సిన్  స్టోరేజ్ సెంటర్ వద్ద  ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్స్ (ILR)లో ఉంది.  పోలీసు భద్రతను కూడా కల్పించారు.

శుక్రవారం నగరంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(GGH)లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే ఏర్పాట్లును కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ పరిశీలించారు.

మరో వైపు ప్రభుత్వ అదేశాల ప్రకారం ఈ నెల 16 నుండి జిల్లాలో 30 సెషన్ సైట్స్ లో మొదటి విడుదలో హెల్త్ వర్కర్స్ కు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లన్నీ సర్వం సిద్ధం చేశామని, ఇప్పటికే రెండు సార్లు విజయవంతంగా వ్యాక్సినేషన్ డ్రై రన్ ను జిల్లాలో నిర్వహించామని, కోవిడ్-19 వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు, అధికారులతో, డాక్టర్లతో తాను, పలుమార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించడంతో పాటు వ్యాక్సిన్ నిల్వ కేంద్రం, డ్రై రన్ ను స్వీయ పర్యవేక్షణ, తనిఖీలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

రేపటి కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కృష్ణా జిల్లా ఇంతియాజ్

ఈ నెల 16 న  మొదటి దశలో హెల్త్ కేర్ మరియు అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. రెండవ దశలో ఫ్రంట్లైన్ వర్కర్ లు (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, శానిటేషన్ ఇతర శాఖల సిబ్బంది), 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లు లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు, మూడో దశలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.

ఇందుకు 36007 మంది హెల్త్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ప్రతి టీకా కేంద్రంలో సుశిక్షితులైన వ్యాక్సినేషన్ అధికారి 1 గా పోలీస్/ మహిళపోలీస్, వ్యాక్సినేషన్ అధికారి 2 గా వెరిఫికేషన్ మరియు డేటా ఎంట్రీ కోసం డిజిటల్ అసిస్టెంట్ లేదా వాలంటీర్ ని, వ్యాక్సినేషన్ అధికారి 3 గా వ్యాక్సినేషన్ వేసేందుకు ఏఎన్ఎం / జిఎన్ ఎమ్ / డాక్టర్,  వ్యాక్సినేషన్ అధికారి 4 గా అంగన్వాడీ వర్కర్ ని, వ్యాక్సినేషన్ అధికారి 5 గా ఆశా వర్కర్ లు ఉంటారు.

వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఎక్కడైనా దుష్ఫలితాలు కలిగితే వారికి వెంటనే వైద్యం చేయడం, లేదా ఆస్పత్రికి తరలించి తగు జాగ్రత్తలు చేపట్టామని, తొలివిడత వ్యాక్సినేషన్ చేసిన తరువాత కోవిడ్ వ్యాక్సిన్ ధృవపత్రం జారీ చేస్తామని దాని ఆధారంగానే 28 రోజున రెండో విడత వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ప్రతి టీకా కేంద్రంలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో, తమ మొబైల్ నెంబర్ కు వచ్చిన సంక్షిప్త సందేశం చూయించిన 100 మంది వరకు వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, డి యంఎచ్ఓ డా. యం.సుహాసిని, సూపరింటెండెంట్ డా. కె.శివశంకర్, సి ఎస్ ఆర్ ఎంవో డా.హన్మంతరావు ,తహసీల్దార్ యల్లారావు ,వైద్య సిబ్బంది వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *