సిసిటివి కెమెరాల నిఘాలో ఆంధ్ర ఆలయాలు…

ఆంధ్రప్రదేశ్ లో గత సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశారు. అంతేకాకుండా 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్య రాష్ట్రంలో అనేక చోట్ల ఆలయమాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంల గుడులమీద  నిరంతర నిఘా ఏర్పాటుచేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాలను ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

DGP Gowtham Sawang

ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతో పాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను/ ముఠాలను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు.

ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్/dail100, దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా 9392903400 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము.

ఈ రోజు ఆయన మీడియాకు వెల్లడించిన విషయాలు:

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం.

గత సంవత్సరం(2020) సెప్టెంబర్ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది.

దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.

ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయి.

తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలు పరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో చర్చించిన పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం.

రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశాం.  త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తాము.

కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు.  ఈ ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

మన రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు లో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం తో పాటు సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం.

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది MO అఫెండర్స్ ను ఇప్పటికే గుర్తించాం. వారందరినీ కూడా జియో మ్యాపింగ్ తో అనుసంధానం చేశాం.

వీరిపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్ ను ఓపెన్ చేస్తాం.

రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఏపీ లో దేవాలయాలకు/ పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ.

అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు.

దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి ఇది మనందరి బాధ్యత మీ అందరి సహకారంతో మన సంప్రదాయాలను గౌరవిస్తూ దేవాలయాలను కాపాడుకుందాం..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *