ఆంధ్ర కోవిడ్ వ్యాక్సిన్ లబ్దిదారులను ఎంపిక పూర్తి, వివరాలు

కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఆంధ్రప్రదేశ్ సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు మొదలు పెట్టింది.

పూణె నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న  వ్యాక్సిన్ బాక్సుల   గన్నవరం టీకాల సెంటర్‌కుతరలించారు…

వ్యాక్సిన్ ను నిల్వ చెయ్యడానికి అవసరం అయిన కోల్డ్  స్టోరేజ్ ఏర్పాట్లు చేసి అక్కడ బాక్స్ లను భద్రపరిచారు.

ఇక, ఇప్పటికే రాష్ట్రానికి చేరిన వ్యాక్సిన్ ను అన్ని జిల్లాలకు పంపిణీ చేసే పని మొదలు పెట్టారు.

వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది తొలి విడతగా వ్యాక్సిన్ తీసుకోనున్నారు.

ముందుగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్‌ టీకాలు వేయనున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునే 3,87,983 మందిని గుర్తించారు.

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో,  అత్యల్పంగా విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్‌ లబ్దిదారులను గుర్తించారు.,.

కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్ధిదారులకు కోవిన్‌ యాప్‌ ద్వారా  ఎస్సెమ్మెస్  ద్వారా వివరాలు  పంపిస్తారు.

ఇక, జిల్లాల వారీగా కోవిడ్‌ వ్యాక్సిన్ లబ్దిదారుల వివరాలు:

అనంతపురంలో 29,065,..

చిత్తూరులో 33,773,
తూర్పు గోదావరిలో 38,128,

గుంటూరులో 35,389,

కృష్ణా జిల్లాలో 34,813,…

కర్నూలులో 33,279,

ప్రకాశం జిల్లాలో 25,383,

నెల్లూరులో 31,346,

శ్రీకాకుళంలో 21,934,

విశాఖపట్నంలో 36,694,

విజయనగరంలో.. 17,465,,

పశ్చిమగోదావరిలో 27,323,

కడప జిల్లాలో 23,391

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *