తెలంగాణలో 17 లక్షల మందికి తొలివిడత వ్యాక్సిన్

తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షల మందికి, కామారెడ్డి జిల్లాలో 12వేల మందికి మొదటి విడతలో ఇవ్వడం జరుగుతుంది.

వాక్సిన్ పంపిణీకి జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసి, 60 మంది వైద్య సిబ్బందిని నియమించడం జరిగింది.

జిల్లాలో 1200 వయిల్స్ 26 కేంద్రాల్లో భద్రపరిచేందుకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.

భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కో వ్యాక్సిన్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణే) వారు తయారు చేసిన కోవి శీల్ వాక్సిన్ లు మాత్రమే తెలంగాణలో వాడుతున్నారు.

వ్యాక్సిన్ పై అపోహలు అవసరం లేదు..భారత ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకున్న తర్వాతే, శాస్త్రవేత్తల పరిశీలన తర్వాతే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది.

ఎవరికైనా వాక్సిన్ వికటిస్తే వారికి ఎ ఈ ఎఫ్ ఐ అనే రియాక్షన్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

మొదటి విడత వాక్సిన్ ఇచ్చిన 28 రోజుల తరువాత రెండవ విడత ఇవ్వడం జరుగుతుందని, రెండవ విడత ఇచ్చిన 14 రోజుల తరువాత మూడవ విడత ఇవ్వడం జరుగుతుంది.

ఈ విషయాలను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.ఈ రోజు ఆయన  కామారెడ్డి జిల్లాలో వాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించారు.

కామారెడ్డి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించిన వారిలో 22% ఉన్న పాసిటివ్ కేసులు ప్రస్తుతం 0.34 శాతానికి తగ్గిపోయాయి.

భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుంది.

ఇంత మందికి వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వడం చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు అని ఆయన వ్యాఖ్యానించారు.

మొదటి విడత వాక్సిన్ పంపిణీలో దేశంలోని 3 కోట్ల మంది ప్రంట్ లైనర్ లకు (వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు,రెవెన్యూ శాఖ సిబ్బందికి) ఇవ్వడం జరుగుతుంది.

ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.వ్యాక్సినేషన్ ను విజయవంతం చేయడానికి అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *