జర్నలిస్టుల పోరాటానికి ఎంపి రేవంత్ మద్దతు

ర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతానని  కాంగ్రెస్ పార్టీ   వర్కింగ్ ప్రెసిడెంట్, యం. పి  రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ  రోజు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు  రేవంత్ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ  సందర్భంగా జర్నలిస్టు రాష్ట్రంలో తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను రేవంత్ ద‌ృష్టికి తీసుకువచ్చారు.
జర్నలిస్టులకు  వైద్య, విద్య, గుర్తింపు కార్డులు జారీ చేయడం ,నివాస స్థలాలు అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం   పూర్తిగా విఫలమైందని వారు రేవంత్ కు తెలిపారు.

ప్రజా సమస్యలపై నిర్భయంగా గొంతెత్తి, కలాన్ని ఝలిపిస్తే  రాష్ట్ర ప్రభుత్వం,పోలీస్ లు జర్నలిస్ట్ లను వేది స్తున్నారని వారు రేవంత్ రెడ్డికి విన్నవించారు.
అయినప్పటికీ జర్నలిస్టులు నిష్పక్షపాతంగా దేనికి  వెరవక  పోరాటం చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టులు సతీష్ కమాల్, అమర్, విద్యావెంకట్, అబీబ్, శ్రీకాంత్, అనిల్, రాఘవేంద్ర  లు,తెలిపారు.
భావసారూప్యత కలిగినవ్యక్తులందరూ సమూహంగా ఏర్పడి హక్కుల కోసం, వసతుల కోసం పోరాటంచేస్తున్నాని అన్నారు.
 జర్నలిస్టులను పోరాటాన్ని  స్వాగతిస్తూ,  రాష్ట్రప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీల నెరవేర్చేలా చేసేందుకు   తన వంతు సహకారం ,అండదండలు ఎల్లవేళలా అందిస్తానని రేవంత్ రెడ్డి హామీఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *