హైదరాబాద్ అపోలోలో చేరిన సూపర్ స్టార్ రజినీ కాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన పదిరోజులుగా హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆయనకు బిపి తీవ్రంగా ఒడిదుడుకులు అవుతుంటూ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి బులెటీన్ విడుదల చేసింది.
 మొదట్లో సెట్స్ లో ఉన్న ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.  దీనితో రజినీ కాంత్ కు డిసెంబర్ 22న కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అపుడాయన నెగెటివ్ అని తేలిసింది. అయితే, ఆయన బిపి ఒడిదుడులు ఎదుర్కొంటోంది.
దీనితో ఆయనను అపోలోలో చేర్చారు. డాక్టర్లు ఆయన పర్యవేక్షిస్తున్నారు.బిపి స్థిరపడేదాకా ఆయన ఆసుపత్రిలోనే ఉంటారు.  బిపి, అలసట తప్ప  మరొక సమస్యలేదని, ఇతర రోగాల లక్షణాలు లేవని,హిమో డైనమికల్లీ ఆయన స్టేబుల్ అని ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *