తెలంగాణలో ప్రజలంతా మిషన్ భగీరథ నీళ్లే తాాగాలి…

తెలంగాణలో మిషన్ భగీరథ నీళ్లు మాత్రమే తాగేలా ప్రజల్ని చైతన్యపరిచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంతేకాదు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భగీరథ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
రైతు వేదికలు, వైకుంఠదామాలకు భగీరథ నీటిని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. అంగన్ వాడీలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్యసంస్థలతో పాటు ధార్మిక సంస్థలకు కూడా భగీరథ వాటర్ కనెక్షన్ ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు.
మూడు రోజుల కిందట సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యు  జగ్గారెడ్డి మిషన్ భగీరథ నీళ్లని ఎవరూ తాగడం లేదని, వాటిని  కేవలం మరుగుదొడ్లకు మాత్రమేవాడుతున్నా రని తీవ్రమయిన వ్యాఖ్య చేశారు.
 అసలు టిఆర్ ఎస్ నేతలెపుడయినమిషన్ భగీరథ నీళ్లు రుచి, వాసన చూశారా అని కూడా ఆయన ప్రశ్నించారు.
 ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ భగీరథ నీళ్లే అంతా తాగాలని,  ప్రభుత్వాధికారులు కూడా తాగితీరాలని, ప్రభుత్వ కార్యక్రమాలలో మిషన్ భగీరథ నీళ్లనే బాటిల్స్ లో నింపి ఇవ్వాలని ప్రకటించారు.
ఈమేరకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు  కార్యక్రమాలను మరిన్ని రూపొందించాలన్నారుస్మితా సభర్వాల్ అన్నారు.
“భగీరథ కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదు.’ అని ఆమె  ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సిఈ, ఎస్.ఈలతో సమీక్షా సమావేశంమాట్లాడుతూ చెప్పారు.
ఈ నెల చివరి నాటికి మారుమూల ఆవాసాలు ( ఐసోలేటెడ్ ) అన్నింటికి భగీరథ నీటిని అందించాలి. జనవరిలో నిర్వహించే సమీక్షా సమావేశం నాటికి రాష్ట్రంలోని అన్ని ఐసోలేటెడ్ ఆవాసాలకు భగీరథ నీరు సరాఫరా కావాలి. ఇక భగీరథ లో భాగంగా నిర్మించిన సివిల్ కట్టడాలు, పంపుసెట్లు, పైప్ లైన్ ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని ఆమె ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తో పాటు చీఫ్ ఇంజనీర్లు, ఎస్.ఈలు పాల్గొన్నారు.
ముందుగా రోజువారీ తాగునీటి సరాఫరా తీరును ఈఎన్.సి కృపాకర్ రెడ్డి సిఎంఓ కార్యదర్శికి వివరించారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథతో శుద్దిచేసిన తాగునీరు అందుతోందని, అనుకున్న పరిమాణం కంటే ఎక్కువగానే నీటిని సరాఫరా చేస్తున్నామని చెప్పారు. సరాఫరాతో పాటు నీటి నాణ్యత పై దృష్టి పెట్టామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న స్టెబిలైజేషన్ కార్యక్రమాల్లో ఇంటింటికి సరాఫరా అవుతున్న నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ నిపుణులతో ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు.
దీనిపై సంతోషం వ్యక్తం చేసిన స్మితా సభర్వాల్ వందకు వంద శాతం స్టెబిలైజేషన్ ను సాధించిన అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *