బండారు దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఒక పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
నల్లగొండలో తనకు ఏర్పాటు చేసిన  పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు  హైదరాబాద్ నుండి బయలు దేరారు.  నల్లగొండ దారిలో చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది.

రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు దూసుకు పోయి ఈ పమాదం జరిగింది. అయితే,  డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో భారీ ప్రమాదం తప్పినట్లుఅధికారులు చెబుతున్నారు. కారు రోడ్డు పక్కకు దూసుకుపోయినపుడు అక్కడ పెద్ద మాన్లు గాని, గోడలు గాని లేకపోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ప్రమాదంలో  ఎవరూ గాయపడలేదు.
కొద్దిసేపటి తర్వాత గవర్నర్ దత్తాత్రేయను మరో వాహనంలో నల్లగొండకు తీసుకువెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *