రాయలసీమ ఉద్యమ నేత పిచ్చయ్య యాదవ్ మృతి

శ్రీ పిచ్చయ్య యాదవ్ గారి మృతి సామాజిక ఉద్యమానికి తీరని లోటు
(బొజ్జా దశరథ రామిరెడ్డి)
సామాజిక ఉద్యమ నేత, రాయలసీమ సాగునీటి సాధన సమితి క్రియాశీలక సభ్యులు శ్రీ పిచ్చయ్య యాదవ్ గారు అనారోగ్యం తో ఈరోజు తెల్లవారుజామున మరణించారు. వారి మరణం పట్ల రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నది.

శ్రీ పిచ్చయ్య యాదవ్ యాదవ్ గారు ఉపాధ్యాయ వృత్తిలో అత్యంత నిబద్దతతో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించారు. పదవి విరామం అనంతరం కూడా స్వయంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించి సామాజిక అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఏర్పడిన నాటి నుండి కూడా రాయలసీమ ప్రజలకు అవగాహన, చైతన్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.‌ గుండ్రేవుల రిజర్వాయర్ సాధనకై కర్నూలు నుండి గుండ్రేవుల వరకు 2018 వ సంవత్సరంలో జరిగిన పాదయాత్రలో 72 ఏళ్ళ వయస్సులో కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.‌
వారి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాము.
బొజ్జా దశరథరామిరెడ్డి
(బొజ్జా దశరథ రామి రెడ్డి,అధ్యక్షులు,రాయలసీమ సాగునీటి సాధన సమితి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *