కిషన్‌రెడ్డి గారూ… ఇంత కామెడీగా ఉందా? : శ్రవణ్ దాసోజు

హైదరాబాద్:  తెలంగాణ లో ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఎద్దేవా చేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రిగా రాజ్యాంబద్ధమైన పదవిలో ఉంటూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ గగ్గోలు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన పోలీసులపై నేరుగా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఉన్నా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కామెంట్లు చేయడమేమిటని ఆయన అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేతూ రైట్ టు ప్రైవసీ ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకో గల్గిన అన్ని అధికారాలు సాధికారత ఉన్న రాజ్యాంగబద్దమైన పదవి లో ఉండి కూడా, కేంద్ర హోమ్ మంత్రి కిషన్ రెడ్డి గారు సామాన్యులవలె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటే, మరి సామాన్యుడి పరిస్థితి ఏంది అని డాక్టర్ దాసోజు ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నేతల ఫోన్లను ట్యాప్‌ చేయడం ఎప్పటి నుంచో జరుగుతోందని… ఇపుడు కిషన్‌ రెడ్డికి తెలిసిన తరవాత కూడా కేంద్ర హోమ్ మంత్రిగా చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయడమేమిటని అన్నారు. హోం శాఖనే స్వయంగా దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదని ఆయన నిలదీశారు.
వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతను రాష్ట్ర పోలీసులు, ఐఏఎస్‌ అధికారి జయేష్‌ రంజన్‌లు ఉల్లంఘిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర హోం శాఖకు తాను గతంలో నేరుగా ఫిర్యాదు చేసినా… ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలదేన్నారు.
ఇక ఇపుడు కిషన్‌ రెడ్డికి కూడా నిజం తెలిసింది కాబట్టి.. వెంటనే విచారణ జరిపి, దోషులను శిక్షించాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *