అభిమానులకు శుభవార్త చెప్పిన తెలుగు హీరోయిన్

ఉద‌య్ కిర‌ణ్ హీరోయిన్ గా వచ్చిన  ‘నువ్వు నేను’ చిత్రంలో హీరోయిన్ గా చేసిన అనిత   అభిమానులకు శుభవార్త చెప్పింది.  తను త‌ల్లి కాబోతోంది.  త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ వీడియోతో ఈ బిగ్ న్యూస్‌ను ఆమె అనౌన్స్ చేసింది. నువ్వు నేను సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. శ్రీరామ్ లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా మాయం అయిపోయింది. 39 ఏళ్ల ఈ భామ 2013లో గోవాలో ఆమె వ్యాపార‌వేత్త రోహిత్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుని సెటిలైంది.
ఇక అనిత షేర్ చేసిన వీడియోలో.. వాళ్ల త‌మ ల‌వ్ స్టోరీని మ‌ళ్లీ మ‌న క‌ళ్ల ముందు ఆవిష్క‌రించారు. మొద‌ట‌గా ల‌వ‌ర్స్‌గా క‌నిపించ‌డం, రోహిత్ ప్ర‌పోజ్ చేయ‌డం, పెళ్లి, ఆ త‌ర్వాత అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించ‌డం దాకా ఈ వీడియోలో మ‌న‌కు క‌నిపిస్తుంది. సినీ రంగం నుంచి టీవీ రంగంలోకి వెళ్లి అక్క‌డ బాగా పాపుల‌ర్ అయిన అనిత వీడియో చివ‌ర‌లో ఉబ్బెత్తుగా ఉన్న త‌న క‌డుపును చూపించ‌గా, రోహిత్ ఆమె క‌డుపును ప్రేమ‌గా ముద్దు పెట్టుకున్నాడు. ఆ వీడియోకు “ల‌వ్ యు రోహిత్” అనే క్యాప్ష‌న్‌, హార్ట్ ఎమోజీల‌తో షేర్ చేసింది. మీరు ఆ వీడియోని ఇక్కడ చూడచ్చు.
అనిత  ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.  ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెట్టడం మాత్రం మానలేదు. దాదాపు నలభైల్లోకి వస్తున్నా  జిమ్ములో కసరత్తులు చేస్తూ.. కఠినమైన డైట్ ఫాలో అవుతూ స్లిమ్ముగా మెయింటెయిన్ చేస్తోంది. ముఖం లో కాస్త ఏజ్ కనిపిస్తోంది కానీ అందం చందం ఏమాత్రం తగ్గలేదని ఆమె ఫ్యాన్స్ మురిసిపోతూంటారు.