10న టిటిడి ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకారం!

తిరుమల తిరుపతి  దేవస్థానాల (TTD)బోర్డు కార్యనిర్వహణాధికారి (EO)గా నియమితులైన సీనియర్ ఐఎఎస్  అధికారి జవహర్ రెడ్డి ఈ నెల 10వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1990 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఇపుడు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ హోదాలో ఉన్నారు.
ఆయన శుక్రవారం సాయంత్రానికి తిరుపతి చేరుకుకుంటారు.
శనివారం ఉదయం కాలినడకన తిరుమలకు బయలు దేరుతారు. అదేరోజు మధ్యాహ్న సమయంలో, సంప్రదాయం మేరకు శ్రీవారి ఆయలంలో ఈవోగా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.‌
ఇప్పటిదాకా ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ అడిషనల్ ఛార్జి హోదాతో తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి ఈవో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం నాడు ధర్మారెడ్డి నుంచి జవహర్ రెడ్డి బాధ్యతలు ‌స్వీకరిస్తారు