చాాాలా మంది టిఆర్ ఎస్ నేతలు బిజెపిలో చేరేందుకు రెడీ : బండి సంజయ్

కరీంనగర్ లోక్ సభ్యుడు,  బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చాలా ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు. ఆయన ఈ రోజు పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కోవిడ్ క్షమా భిక్ష పెట్టిందని, లేకుంటే ఆయన సంగతేంటో బయటపడేదని అన్నారు.
పార్టీ చాలా మంది నేతలకు కెసిఆర్ నియంతృత్వ ధోరణి నచ్చడం లేదని, వారంతా బిజెపిలో చేేేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. ఎందుకు చేరడంలేదో, ఎపుడో చేరతారో ఆయన వెల్లడించలేదు.
ఎన్నిలకపుడు ఆయన చాలా హామీలు చేశారని, తీరా ఎన్నికలయిపోయి గెల్చాక వాటిని గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.