ఆంధ్ర మద్యం తాగితే రెండు మూడేళ్లలో చచ్చిపోతారు: రఘురామ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం తాగితే రెండుమూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికరమయిన వ్యాఖ్య చేశారు. ఆంధ్ర  ప్రదేశ్ లో దేశంలో ఎక్కడాదొరకని, ఎవరూ వినని, చోద్యమయిన బ్రాండ్ల మద్యం ప్రభుత్వం విక్రయిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ  రఘురామకృష్ణం రాజు ఈ వ్యాఖ్య చేశారు.
’ఆంధ్ర ప్రదేశ్ లో తయారయ్యే మద్యం సేవిస్తే రెండుమూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉంది. మద్యనిషేధం పేరుతో ఎక్కడాలేని బ్రాండ్లను తీసుకొచ్చి అమ్ముతున్నారు.  ఊరు పేరు లేని బ్రాండ్లను ప్రజలు  గత్యంతరం లేక తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇవి  తాగడం ప్రజలు మానేయాలి,’ అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే  ఈ మాయదారి బ్రాండ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలియదని కూడా ఆయన అన్నారు.
అసలు, దేశంలో ఎక్కడాలేని బ్రాండ్లు రాష్ట్రంలో ఎలా లభ్యం అవుతున్నాయయోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాుు.
ఈ బ్రాండ్ల బాగోతం విచారణ జరిపించి వెల్లడించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.