ఇదే దేశంలో మొట్టమొదటి కల్లు రెస్టరాంట్ హైదరాబాద్ ‘నీరా కేఫే’

 ఇది హైదరాాబాద్ లో రానున్ననీరా కేేఫే. ఇది  మొదలయితే, దేశంలోనే మొట్టమొదటి కల్లు కెఫే అవుతుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గౌడ వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపేట్టిన నీరాపాలసీ వల్ల ఇది కార్యరూపం దాలుస్తూ ఉంది.
 భారతదేశంలో అత్యంత అధునికరమైన ఈ నీరా కేఫే హైదరాబాద్ లోని నెక్లేస్ రోడ్ లో 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నారు.
ఈ  నీరా స్టాల్ ను హైదరాబాద్ నగరంలో ఎంతో విలువైన ప్రాంతంలో ఏర్పాటు అవుతూ ఉండటం విశేషం.
ఈ విషయాన్ని రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్ గారు వెల్లడించారు.
 శంకుస్థాపన కార్యక్రమం గురించి  మంత్రి  శ్రీనివాస్ గౌడ్ గౌడ సామాజిక ప్రజాప్రతినిధులు మరియు గౌడ సంఘాల నాయకులతో రవీంద్రభారతి లోని తన కార్యాలయంలో  సమావేశం నిర్వహించారు.
తరతరాలుగా లక్షలాది మంది గీత కార్మికులు చెట్ల పన్ను ను ప్రభుత్వానికి చెల్లించినా చివరకి సమైఖ్య రాష్ట్రంలో గీత వృత్తిని నిషేదించాలని కుట్రలు చేశారని మంత్రి చెప్పాడు. కాని ప్రత్యేక రాష్ట్రంలో  . నేడు గీత వృత్తికి పూర్వ వైభవం తీసుకరావటానికి ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రవేశ పేట్టి గీత వృత్తిదారులకు అండగా ప్రభుత్వం నిలిచిందని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఈ సమావేశంలో అత్యంత అధునిక నీరా కేఫ్ ప్రతిపాదిత నమూనా ను మంత్రి పరిశీలించారు. అనంతరం ప్రతిపాదిత నమూనా ను హజరైనా ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులతో చర్చించారు. శంకుస్థాపన కార్యక్రమములో నిర్వహణ కార్యక్రమాలపై మంత్రి చర్చించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా  ప్రతినిధులు, కుల సంఘాల నాయకులను ప్రత్యేకంగా మంత్రి అహ్వానించాలని నిర్ణయించారు.
అందులో భాగంగా శాసన సభ డిప్యూటి స్పీకర్ శ్రీ తీగుళ్ల పద్మరావు గౌడ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ, శ్రీ. గంగాధర్ గౌడ్ గారు, శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, శ్రీ వివేకనంద గౌడ్ గారు, ఛైర్మన్ లు శ్రీ రాజేషం గౌడ్ గారు, శ్రీ నాగేందర్ గౌడ్ గారు, మజీ శాసన మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ గారు, జిల్లా పరిషత్ ఛైర్మన్ లు , గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారు  మరియు మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ ఎం పీ లు మరియు ఎన్నో ఎళ్ళు గా గౌడ సామాజిక వర్గానికి సేవలు అందిస్తున్న నాయకులు మరియు జె ఎ సి నాయకులు ఈ కార్యక్రమము లో ఇదే ఆహ్వానంగా భావించి కోవిడ్ నిబందనలను దృష్టి లో పెట్టుకోని వివిధ సంఘాల అధ్యక్ష , కార్యదర్శులు మాత్రమే పాల్గోనాలని మంత్రి కోరారు.
నీరా పాలసీ ని ప్రవేశ పేట్టి నీరా ను ఉత్పత్తి చేయటానికి గీత వృత్తి దారులకు మాత్రమే గీసుకోవటానికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఈ సందర్బంగా కృతజ్ఢతలు
రాష్ట్రంలో ప్రతి గౌడ సోదరుడు కనీసం మూడు ఈత, తాటి మరియు గిరుక తాళ్ళు ( డాలర్ ట్రీ ) లను నాటి గీత వృత్తి ని కాపాడుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో శాసన మండలి సభ్యులు శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ఫైనాన్స్   ఛైర్మన్ శ్రీ రాజేషం గౌడ్ గారు, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పల్లే లక్ష్మణ్ గౌడ్ గారు, గౌడ ఐక్య సాదన సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అంబాల నారాయణ గౌడ్ , పర్యాటక శాఖ ఎం డి మనోహర్ , టూరిజం అధికారులు అశోక్ మరియు తదితరులు పాల్గోన్నారు.