ఆంధ్రాకు అధిక ఉష్ణోగ్రత హెచ్చరిక, జాగ్రత్త అంటున్న విపత్తుల శాఖ

ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు  బాగా ఎక్కువయి వేడి పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది . మే 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని, వడదెబ్బతగలకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆంధప్రదేశ్ విపత్తుల శాఖ హెచ్చరించింది. ఈ ఉష్ణోగ్రతలు ఇలా ఉంటాయి.
మే 25,2020
విజయనగరం ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం , విశాఖపట్నం, క్రిష్ణా , గుంటూరు , అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనివిపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.
మే 26,2020
విజయనగరం , తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 27,2020
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప , కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం , విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°C-40°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మే 28.2020
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు,చిత్తూరు,కడప, అనంతపురం,కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
రాత్రి పూటలు కుడా సాధారణం కంటే 1°C-2°C ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది
విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా  కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మద్య ప్రజలు బయట రాకుడదని కోరారు. వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి.
మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.