విశాఖ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

బ్రేకింగ్ న్యూస్:

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి వ్యవహారంపై NHRC (national human rights commission) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

విషవాయువు లీకేజి ఘటనపై అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఎన్ హెచ్ ఆర్ సి.

ఘటన ఆంధ్ర ప్రదేశ్ డిజిపి విచారణ జరపాలని, 4 వారాల్లోగా నివేదిక అందించాలని నోటీసులు పంపింది.

అలాగే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కూడా 4 వారాల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నోటీసులో పేర్కొంది.