విశాఖ గ్యాస్ లీక్, పరిస్థితి అదుపులోనే ఉంది: మంత్రి గౌతమ్ రెడ్డి

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం మీద మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
* విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులను అప్రమత్తం చేశాం.
* తక్షణమే ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చాం.
* పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్.ఆర్ పురం, టైలర్స్ కాలనీ, నరవ, బి.సీ కాలనీ, బాపూజీనగర్, కంపరపాలెం, కృష్ణానగర్ తదితర ప్రజలకు సాయంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచనలిచ్చాం.
* ఉన్నపలంగా ఇళ్లను వదిలి వచ్చిన స్థానిక ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని కలెక్టర్ కి సూచనలిచ్చాం.
* జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలెవన్ కు ఆదేశించాము.
* ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. అందరినీ కాపాడుకుంటాం.
* బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రభుత్వం.
* ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి స్థానిక ప్రజలను అధికారులు,యువత దూరంగా తరలించడం అభినందనలు.