ఆంధ్రలో నిన్న కొత్తగా 80 కరోనా కేసులు, మృతుల సంఖ్య నిల్

ఏపీలో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదయ్యాయని  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ  పేర్కొంది. దీనితో  రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు  1177 కు చేరుకున్నాయి. అయితే, గత 24 గంటలలో ఒక్కరూ కూడా రాష్ట్రంలో కరోనాతో చనిపోలేదు.
గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులునమోదయ్యాయి.   వైద్యశాఖ విడుడలచేసిన బులెటీన్ విశేషాలు:
గడచిన 24 గంటల వరకు 6517 మంది నుంచి శాంపిల్స్ సేకరణ. వీటిని పరీక్షించగా 80 పాజిటివ్ కేసులు కనిపించాయి.
కర్నూల్ లో 13,గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున కొత్త‌ పాజిటీవ్ కేసులు నమోదు
 మొత్తం పాజిటివ్ కేసులను తీసుకుంటే  అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు 237,కృష్ణా జిల్లాలో 210 కేసులు నమోదు
కరోనా పాజిటివ్ తో 235 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌
వివిధ ఆసుపత్రుల్లో 911 మందికి కొనసాగుతున్న చికిత్స