కరోనా అప్ డేట్ : ఆంధ్ర ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ను చర్యలు చేపడుతూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్ లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్ లు గా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
వారంతా ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అటు హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లాల కార్యాలయాల్లో ను రెండు గ్రూప్ లు గా ఉద్యోగుల విధులకు హాజరు కావొచ్చని ప్రభుత్వం పేర్కొంది.
గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయసు పైబడిన సలహాదారు లు, చైర్ పర్సన్లు ఇంటి వద్ద నుంచే పని చేయవచ్చు.
50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకొస సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు కూడా ఇంటి నుంచే పని చేయవచ్చు.
ఏప్రిల్ 4 తేదీ వరకు ఇంటి వద్దే. వైద్య ధ్రువీకరణ లేకపోయినా ఇంటి వద్దే ఉండొచ్చని స్పష్టం
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
ఉద్యోగులు కు 9.30, 10, 10.30 గంటల వేర్వేరు షిఫ్టు లో హాజరు  కావాలి.
ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అనుమతి లభించిన ఉద్యోగుల ఈ-ఆఫీసు ద్వారా విధులు నిర్వహించాలి.
ఈ ఉత్తర్వులు అత్యవసర సేవల విభాగాలకు వర్తించవు.
రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు , సహకార సంస్థలు, స్వతంత్ర్యప్రతిపత్తి కలిగిన సంస్థలకు వర్తిస్తుంది.
తదుపరి ఉత్తర్వుల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబోమని  ప్రభుత్వం పేర్కొంది.
వీలైనంత మేరకు ప్రభుత్వం కార్యాలయంలోకి సందర్శకులను అనుమతి ఉండదు.
సచివాలయం, హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మందికి విధులకు హాజరు అయ్యేలా, మరో 50 శాతం మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటారు.
ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ జివొ లో పేర్కొన్నారు.