మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ హైకోర్టు నిలుపుదల

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నోటీఫికేషన్ రేపు విడుదలచేయవద్దని  రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు నిర్వహణ పై హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే  విచారణరేపటికే  వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు   నోటిఫికేషన్ విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశించినా,రేపు ఉదయం విచారణ పూర్తయితే,  నోటిఫికేఫన్ విడుదల చేయమని చెప్పవచ్చు. విచారణ పూర్తికాకపోతే, రేపు నోటిఫికేషన్  రాకపోవచ్చు.
రిజర్వేషన్లు ప్రకటించక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపట్ల అభ్యంతరం చెబుతూ మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణకు వచ్చింది.