అబ్దుల్లాపూర్ మెట్ మహిళా తహసీల్దార్‌ సజీవదహనం

రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవంగా దహనమయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ  దారుణం జరిగింది. కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు తహసీల్దార్ విజయపై  పెట్రోలు పోసి నిప్పింటించాడు.
తహసీల్దార్ విజయ మంటల్లో కాలిపోయి మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.
ఆగంతకుడు తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.అయితే, కాలిన గాయాలతో పారిపోయినట్లు చెబుతున్నారు.  తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో దుండగుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ కొత్తగా మండలం అయినతర్వాత తొలి తాహశీల్దార్ విజయారెడ్డియే.ఈ దారుణం జరగ్గానే పెద్ద ఎత్తున పోలీసులు, రెవిన్యూ అసోసియేషన్ నాయకులు, సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావారణ నెలకొంది.
అబ్దుల్లా పూర్ తహశీల్దార్ విజయా రెడ్డి దారుణ హత్యకు నిరసనగా అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగుల నిరసన. నిందితులును కఠిన శిక్షించాలని డిమాండ్.
పూర్తి సమాచారం అందాల్సి ఉంది.