ఒఆర్ ఆర్ మీద ప్రమాదం, దంపతుల మృతి

అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.ఈ  తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు మృతి చెందడం  స్థానికంగా కలకలం రేపింది.
వారు ప్రయాణిస్తున్న  బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అయితే,దీనితో  జనం అగ్రహోదగ్రులయ్యారు. ఔటర్ రింగు రోడ్డు వద్ద ట్రాఫిక్ దిగ్బంధించి  ధర్నాకు దిగారు.  ప్రమాదం ఉదయం 6 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది.
ధర్నా  వల్ల అబ్దుల్లాపూర్ మెట్ నుంచి హయత్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  నగరంలోకి రాకపోకలు బంద్ అయ్యాయి. ఔటర్ రోడ్ ఎక్కేందుకు, దిగేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది.జిల్లాల నుంచి వచ్చే వాహనాల్లోని ప్రయాణికుల తీవ్ర ఇబ్బంది పడ్తున్నారు. అటోలు, బస్సులు, అన్నిరకాల వాహనాలు నిలిచి పోయాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్న పాఠశాల, కళాశాలల విద్యార్థులు, ఉద్యోగులు.