అవి అబద్దాలు, విలీనం విషయంలో వెనకంజే లేదు: అశ్వత్థామ్ రెడ్డి

ఆర్టీసిని ప్రభుత్వంలోవిలీనం చేయాలనే డిమాండ్ మీద వెనక్కి తగ్గినట్టు ప్రభుత్వ ప్రచారం చేయడాన్ని ఆర్టీసి జెఎసి నేత అశ్వత్థాం రెడ్డి ఖండించారు

దిల్ సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో ఆర్టీసీ ఈరోజు ధూం ధాం కార్యక్రమం జరిగింది.అందులో జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావుతో కలసి పాల్గొన్నారు.

ఆర్టీసి జేఏసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి కామెంట్స్

ప్రభుత్వం చెప్పే విధంగా మేము ఎక్కడ కూడా విలీనం విషయం లో వెనక్కితగ్గలేదు.  ఎక్కడా అలా చెప్పలేదు.

కోర్టులో మేము కానీ, మా తరపు న్యాయవాదులు గాని ఆర్టీసీ విలీనమ్ అవసరం లేదని చెప్పినట్టు నిరూపిస్తే ఏ శిక్ష కు అయినా సిద్దం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్ట బద్దత లేదు

చర్చల కోసం మాకు ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు

ప్రభుత్వ కమిటీ ఎవరితో చర్చిస్తుందో ముందుగా చెప్పాలి

కంటి తుడుపు కమిటీ లతో కాలయాపన అవుతుంది

వెంటనే సంఘాల నేతల ను చర్చ లకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలి