శంషాబాద్ లో ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ముప్పు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి తృటిలో  ప్రమాదం తప్పింది.  విమానం ల్యాండ్ అవుతున్నపుడు  టైర్లలో నుంచి పొగలు వెలువడ్డాయి. ఈ విమానం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి ల్యాండ్ అవుతున్నపుడు ఈ పొగలను గమనించారు. వెంటనే సమాచారాన్ని పైలట్  ఎయిర్పోర్ట్ అధికారులకు చేరవేశాడు. అధికారులు అప్రమత్తమై సురక్షిత ల్యాండింగ్ కు సహకరించారు. విమానంలో 155 మంది ప్రయాణికులున్నారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.