చంద్రయాన్-2 వాయిదా పడటం ఇది మూడో సారి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-2 ప్రయోగం సాంకేతిక కారణాల కారణంగా ఆదివారం అర్థరాత్రి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-3 ఎం–1 రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక లోపం వల్ల ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది.
ఆదివారం ఉదయం 6.51 నిమిషాలకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ప్రయోగానికి 56.24 నిమిషాల ముందుగా అంటే1.55 గంటలకు కౌంట్‌డౌన్‌ ఆగిపోయింది.

A technical snag was observed in launch vehicle system at 1 hour before the launch. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. Revised launch date will be announced later.

— ISRO (@isro) 14 July 2019


అయితే, ఇలా చంద్రయాన్ 2 ప్రయోగం ఇలా వాయిదా పడటం ఇది మూడో సారి. మొదటి సారి దీనిని 2018 ఏప్రిల్ లో ప్రయోగించాలనుకున్నారు. అపుడు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో ప్రయోగాన్ని అక్టోబర్ 2018కి వాయిదా వేశారు.
ఈ అంతరిక్ష వాహనానికి మరిన్ని ప్రయోగాలు చేయాలని చెబుతూ ఇస్రో ప్రయోగాన్ని 2019కి వాయిదా వేసింది.తర్వాత ముహూర్తం జూలై 14 న నిర్ణయించారు.
2019 ప్రయోగానికి వీలుగాచాలా పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక పరీక్షలో లాండర్ కాళ్లు దృఢంగా లేవని, లాండర్ బరువుకు తట్టుకుని నిలబడలేవని కొనుగొన్నారు. అనంతరం దీని బరువు బాగా తగ్గించారు.
చంద్రయాన్ ప్రయోగం అక్టోబర్ 2018 నుంచి ఇప్పటిదాకా వీలుకాకపోవడానికి మరొక కారణం లాంచ్ విండో దొరక్కపోవడం. లాంచ్ విండో అంటే మిషన్ సిస్టమ్ మీద వరుసగా పద్నాలుగు రోజుల ఎండతగలాలి.
ఎందుకంటే, మిషన్ సిస్టమ్స్ మొత్తం సోలార్ ఎనర్జీతోనే నడుస్తాయి. దీనికి భూమి, చంద్రుడు, సూర్యుడు ల పొజిషన్ లాంచ్ కి అనుకూలంగా ఉండాలి. జూలై 15న తెల్లవారుజామున దీనికి అనుకూలం అని శాస్త్రవేత్తలుకనుగొన్నారు.దీనితోనే ఈ తెల్లవారుజామున ముహూర్తం నిర్ణయించారు.
అయితే ఈ సారి GSLV-Mk IIIవాహనంలో ఎదురయిన సమస్యల వల్ల ప్రయోగం ఆగిపోయింది.
చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కావడం భారత్ భవిష్యత్ ప్రయోగాలకు చాలా అవసరం.