విశాఖ శారదా పీఠంలో ముఖ్యమంత్రి జగన్ (ఫోటో గ్యాలరీ)

ఈ రోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించి విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారి ఆశీస్సులు అందుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ లోని శ్రీ శారదా పీఠానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి మధ్యాహ్నం 12.20 గంటలకు చేరుకున్నారు.

శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి ని దర్శించుకున్నారు. వారితో కొంతసేపు ముచ్చటించిన తదుపరి పీఠం ప్రాంగణంలోని దేవాలయాలను సందర్శించుకొని పూజలు నిర్వహించారు. తిరిగి 2.32 గంటకు విశాఖ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *