మొదట జగన్ ఒక్కడే ప్రమాణం

ఈ నెల 30 న వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నసంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. అయితే, ఆరోజు ఆయన ఒక్కరే ప్రమాణం చేస్తారు.  ఈ  విషయాన్ని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ జగనే స్వయంగా వెల్లడించారు. ‘ ఈ నెల 30 న ఒక్కడిగానే ప్రమాణ స్వీకారం చేస్తాను.   తర్వాత, పది, పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది.’ఆయన చెప్పారు.

ఈ రోజు కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని  నరేంద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలను కలుసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *