జయ బయోపిక్ లో కంగనా రనౌత్ పారితోషికం వూహించగలరా?

మెగాస్టార్ అనే మాట ఇంతవరకు హీరోలకే వాడారు తప్ప హీరోయిన్లకు వాడలేదు. ఇపుడు కంగనా రనౌత్ భారతదేశంలో మెగా స్టార్ కాబోతున్నది.

అత్యంత ఎక్కువగా పారితోషికం తీసుకున్న స్టార్ గా ఆమె నిలిచిపోతున్నది. చాలా మంది బాలివుడ్ నటులకంటేకూడా ఆమెకు ఎక్కువ పారితోషికం లభిస్తూ ఉంది.

తమిళ్, హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కతున్న జయలలిత బయోపిక్ లో ఆమెకు రు. 24 కోట్ల రుపాయల పారితోషికం ఇస్తున్నారని హిందూస్థాన్ టైమ్స్ రాసింది.

ఆమెకు ఉన్న స్టార్ పవర్ తో జయలలిత బయోపిక్ హిందీలో బాక్సాఫీస్ దగ్గిర దున్నేస్తుందని చిత్ర నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. రు. 24 కోట్లకు ఆమెతో నిర్మాతలు అపుడే కాంట్రాక్టు కూడా రాయించుకున్నారు. తమిళలో తళైవి గా , హిందీలో జయ గా సినిమా విడుదలవుతుంది. చిత్రానికి డైరెక్టర్ విజయ్, కథరాసింది విజయేంద్ర ప్రసాద్.

భారతదేశంలో ఒక హీరోయిన్ కు రు. 24 కోట్లు పారితోషికం అనేది కనివిని ఎరుగనిది. సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ దీపికా పడుకోన్ కు ఇచ్చిందానికంటే ఇది రెండు రెట్లు ఎక్కువని చెబుతున్నారు. దీపికా పడుకోన్ కు ఈ చిత్రంలో రు. 13 కోట్లిచ్చారని ప్రచారంలోఉంది. ఇది ఈ చిత్రంలో నటించిన రణ్ వీర్, షాహిద్ కపూర్ లకిచ్చిన దానికంటే చాలా తక్కువ. వాళ్లకి ముట్టింది కేవలం రు. 10 కోట్లేనట. కరీనా కపూర్ తన చిత్రాలకు రు. 10 కోట్లు చార్జ్ చేస్తుందని మూవీ మీడియా చెబుతూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *