ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్, కోస్టల్ బ్యాంకు బోర్డ్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ కృష్ణ జిల్లా, నందిగామలో శవమై కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన వంటి మీద ఉన్న గాయాలు చూసి పోలీసులు ఇది హత్యే అని నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యకేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్న పోలీసుల దర్యాప్తులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
పోలీసుల విచారణలో జయరామ్ జనవరి 30 తేదీన హోటల్ దస్పల్లాలో ఉన్నారు. ఆరోజు సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఒకరు జయరామ్ ను కలిసాడు. జయరామ్ ఆదేశాల మేరకు అతడు 6 లక్షల రూపాయలు తీసుకెళ్లి ఇచ్చినట్టు పోలీసులకు తెలిసింది. ఈ డబ్బులను జయరామ్ ఎందుకు తెప్పించుకున్నారు? ఎవరికైనా ఇవ్వడానికా? అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? ఇలా పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.