2019-2020 కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్లోని ముఖ్యాంశాలు

లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌పై శుక్రవారం ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌  ప్రసంగించారు. ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి చదవండి.

ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంపు.

ఈ ఏడాది రక్షణ రంగానికి రూ. 3లక్షల కోట్లు, అవసరమైతే అదనపు నిధులు కేటాయింపు.

వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్‌ గ్రామాల ఏర్పాటు లక్ష్యం.

రైల్వే బడ్జెటరీ సపోర్టు కింద రూ. 64,587 కోట్లు కేటాయింపు.

సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలలో ముందుకు సాగుతున్నాం.

​రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి.

​జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు.

​సుస్థిర, సమ్మిళిత వృద్ధి కొనసాగింపు లక్ష్యంతో బడ్జెట్‌ను రూపొందించాం.

​2020కు నవ భారతం నిర్మిస్తాం.

​దేశం ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి.

​రైతుల ఆదాయం రెండింతలు కావాలి.

​మనది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం.

​3 లక్షల కోట్ల డిఫాల్ట్ లోన్లు రికవర్ చేసాం.

​వృద్ధిరేటులో 11వ స్థానంలో ఉన్న భారత్‌ 6వ స్థానానికి చేరింది.

​మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం.

​రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం.

​మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.

​మా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోంది.

​పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం.

​ గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం.

​గ్రామీణ, పట్టణాల మధ్య అంతరాల తొలగింపుకు కృషి చేస్తున్నాం.

​ గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

​ గ్రామీణ సడక్‌యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగింది.

​మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి 60 వేల కోట్లు ఖర్చు చేశాం.

​మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం.

​22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం.

​ప్రధానమంత్రి సడక్‌యోజనకు.19వేల కోట్లు ఖర్చు చేశాం.

​ఇప్పటివరకూ 3వేల కోట్ల పేదల ధనం ఆదా అయింది.

​2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం.

​పేద రైతులకు ఆదాయం పెంపును చర్యలు చేపట్టాం.

​​చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.

​2 హెక్టార్ల వరకు భూమి కలిగిన చిన్న రైతులకు ప్రతియేటా రూ. 6,000.

​డిసెంబర్ 2018 నుంచే ఈ పథకం అమలవుతుంది.

​దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ది.

​ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

​​ప్రధాన్‌మంత్రి కిసాన్‌ యోజన కింద రైతులకు ఏడాది 6వేలు అందిస్తాం.

​ 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు.

​మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.

​​ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఎకరానికి రూ. 6 వేలు ధనసాయం.

​ప్రతి ఏడాదీ పెట్టుబడి సాయం అందిస్తాం.

​మూడు ఇన్ స్టాల్ మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది.

​చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు

​గ్యాట్యుటీ పరిమితిని 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచుతున్నాం.

​కొత్త పెన్షన్‌ విధానం సరళీకరిస్తాం.

​పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.

​​కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు.

​​ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది.

​కార్మిక ప్రమాద బీమా మొత్తం.1.50 లక్షల నుంచి 6లక్షలకు పెంపు.

​ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్‌.

​60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా 3వేలు పింఛన్‌ వచ్చే విధంగా పథకం.

​నెలకు 100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత .3వేల పింఛన్‌.

​అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు.

​​గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం.

​గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *