ప్రధాని అంటే చంద్రబాబుకు, జగన్ కు భయం…

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరు ప్రధానిని కలసి రాష్ట్ర సమస్యలు గురించి ప్రస్తావించేందుకే భయపడుతున్నారని ఆరోపించారు. ‘ ప్రధానిని కలవాలంటే ముఖ్యమంత్రికి కాంట్రాక్టుల భయం. జగన్ కు కేసుల భయం,’ అని అన్నారు.ఉత్తరాంధ్రను ముఖ్యమంత్రి సర్వనాశనం చేస్తున్నారని అంటూ, అక్కడి భూములు లాక్కుని రియల్ బిజినెస్ చేస్తున్నారని విమర్శించారు.జనసేన పోరాట యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన విశాఖ జిల్లా చోడవరం వచ్చారు. ఆక్కడికి తరలివచ్చిన అశేష జనసందోహాన్నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్రసమస్యల పుట్ట అయిందని అంటూ స్థానికులు పరిశ్రమల పెట్టాలంటేఎకరా మూడుకోట్లు చెబుతున్నారని, అదే ముఖ్యమంత్రి స్నేహితులు, అయిన వారు వస్తే ఎకరా పాతిక లక్షలు ముట్టచెపుతున్నారని పవన్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *